01-05-2025 12:32:56 AM
ఆదిలాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాం తి): జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు ఇటీవల నూతన ఎస్పీగా బాధ్యతలను స్వీకరించిన అఖిల్ మహాజన్ ప్రారంభించిన ఆపరేషన్ ఛబుత్ర జిల్లాలో మంచి సత్ఫలితాలనునిస్తోంది. అర్ధరాత్రి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా పట్టణాలలో అనవసరంగా, అకారణంగా రోడ్లపై తిరిగే వారితో పాటు గల్లీలో అనవసరంగా అర్ధరా త్రి వరకు కూర్చుని పిచ్చాపాటి మాటలు మాట్లాడే వారిపై పోలీసులు కొరడా దులిపిస్తున్నారు.
అనవసరంగా రోడ్లపై తిరిగే వారి తో పాటు ఇంటి ఎదుట గద్దెలపై కూర్చొని పిచ్చాపాటి మాటలు మాట్లాడే వారిని కట్టడి చేసేందుకు ఎస్పీ ఇటీవల ఆపరేషన్ ఛబుత్ర (గద్దెల మీద కూర్చుని మాట్లాడే వ్యసనం) ను ప్రారంభించారు. దీంతో పోలీసులు గత కొన్ని రోజులుగా రాత్రి 11 గంటల నుండి అర్ధరాత్రి దాటే వరకు రోడ్ల పెట్రోలింగ్ నిర్వహిస్తూ రోడ్లపై అనవసరంగా తిరిగే వారితో పాటు గద్దెలపై కూర్చొని మాట్లాడే వారిని పట్టుకొస్తూ పోలీస్ స్టేషన్ వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
ఈ సందర్భంగా గత అర్ధరాత్రి తర్వాత పట్టుకొచ్చిన యువకులతో డిఎస్పి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.... ఇలా ఆదిలాబాద్ పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని పదేపదే అనవసరం గా సంచరిస్తు పట్టుబడిన వారిపై చట్ట ప్రకా రం చర్యలు తీసుకొంటమని హెచ్చరించారు.
ఆదిలాబాద్లోని వ్యాపార సమూహాలు రాత్రి 10:30 గంటలకు మూసి వేయబడతాయని, తదుపరి 11 గంటల వరకు ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అర్ధరాత్రి పట్టణంలో ప్రజల కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నేరాలను నియంత్రణకు యువత ఎలాంటి గొడవలకు దారి తీయకుండా, మద్యం సేవించి రోడ్డు ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని తెలియజేశారు.
ఇదేవిధంగా అర్ధరాత్రి ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, గంజాయి టెస్టు లు నిర్వహించడం జరుగుతుందని యువత సన్మార్గంలో ఉండాలని చెడు వ్యసనాలకు బానిస కాకుండా మాదకద్రవ్యాలకు దూరం గా ఉండాలని సూచించారు. ఈ ఆపరేషన్లో సీఐలు సునీల్ కుమార్, సిహెచ్ కరుణాకర్, ఫణిదర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, వెంకటి, మురళి, శ్రీపాల్, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.