6 June, 2026 | 5:45 PM

Breaking News

గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •   'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యాచరణ   •   అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి   •   ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు   •   38 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   గండిపేట భూముల కబ్జా కేసు: బొల్లా బ్రహ్మనాయుడు కోర్టుకు తరలింపు   •   ప్రోటోకాల్ ఉల్లంఘనపై బీఆర్ఎస్ ఆగ్రహం   •   ఇంటికో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి   •  

కమలాపూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి సేకరణ ప్రారంభం

25-10-2025 06:16 PM

హన్మకొండ,(విజయక్రాంతి): కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉప్పల్ గ్రామంలో  ఐకేపీ ఆధ్వర్యంలో ఖరీఫ్ పంట కొనుగోలు కేంద్రాలను హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ ప్రారంభించారు. అనంతరం తౌటం ఝాన్సీ రాణి మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని, రైతులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. గత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసిందని, ఈ ప్రభుత్వం రైతులను రాజు చేయాలనే  దృఢ సంకల్పంతో అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు.