calender_icon.png 15 June, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక్రిశాట్ స్కూల్‌కు పవన్‌కల్యాణ్

14-06-2025 12:00:00 AM

కొడుకు అడ్మిషన్ కోసం రాక

పటాన్‌చెరు, జూన్ 13: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శుక్రవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణం ఇక్రిశాట్‌లోని ఐఎస్‌హెచ్ (ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్)కు వచ్చారు. ఇక్రిశాట్ స్కూల్‌లో కుమారుడు మార్క్‌శంకర్‌ను చేర్పించేందుకు ఆ స్కూల్‌కు వచ్చారు. ఇటీవల సింగపూర్‌లో అగ్నిప్రమాదంలో గాయపడిన మార్క్‌శంకర్‌ను ఇక్రిశాట్ స్కూల్‌లో పవన్ కల్యాణ్ చేర్పించనున్నట్లుగా సమాచారం.

అన్నా లెజినోవా, పవన్ కల్యాణ్‌ల కుమారుడైన మార్క్ శంకర్ సింగపూర్‌లో సమ్మర్ కోర్సు చదువుతున్న క్రమంలో స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ఘటన తర్వాత మార్క్ శంకర్‌ను ఇండియాకు తీసుకువచ్చి చికిత్స అందించారు.

మార్క్ శంకర్‌ను ఇండియాలోని స్కూల్‌లో చేర్పించాలని భావిం చిన పవన్‌కల్యాణ్ ఇక్రిశాట్ స్కూల్‌లో అతడికి అడ్మిషన్ తీసుకున్నారని సమాచారం. ఇక్రిశాట్ స్కూల్‌కు పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్లాడన్న సమాచారం బయటకు రావడంతో స్థానికంగా అభిమానులు, యువత ఇక్రిశాట్ వద్దకువచ్చారు.