23-08-2025 01:36:53 AM
నాగర్ కర్నూల్, ఆగస్టు 22 (విజయక్రాంతి): నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారి (ఎస్వో) లతను ఉన్నతాధికారులు శుక్రవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాలయానికి ఆమె విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం, మెనూ ప్రకారంగా భోజనం పెట్టకపోవడం,
రాత్రివేళ విధులకు గైరాజర్ కావ డం, స్టాక్ రిజిస్టర్లను మెయింటెనెన్స్ చేయకపోవడం తదితర అంశాలపై గతేడాది నవంబర్ నెలలో విజయక్రాంతి పలు కథనాలు ప్రచురించి వెలుగులోకి తీసుకు వచ్చింది. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమగ్ర విచారణ జరిపిన అధికారులు నివేదికను ఉన్నతాధికారులకు సమ ర్పించడంతో సమగ్ర దర్యాప్తు అనంతరం ఆమెను సస్పెన్షన్ చేస్తూ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ ఉత్తర్వులు ఇచ్చారు.