18-10-2025 09:01:16 PM
- రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన విప్
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): వేములవాడ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ప్రభుత్వ విప్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో గల ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రోడ్లు, పలు పనుల తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ పరిధిలో నిర్మాణంలో ఉన్నాఆ రోడ్లు,ఇప్పటికి ప్రారంభించని పనులు, సిఆర్ఆర్, ఎంఆర్ఆర్ పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు విప్ సూచించారు.