14-08-2025 12:00:00 AM
ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్, ఆగస్టు 13 (విజయ క్రాంతి): పెండింగ్ పనులను త్వరతగతిన పూర్తిచేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో బుధవారం జిల్లాలోని పలు ఆర్వోబీలు, ఇతర రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై జిల్లా కలెక్టర్ తో కలిసి రైల్వే, ఆర్ అండ్ బి, నేషనల్ హైవే, ఇతర శాఖల అధికారులు కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ను కలుస్తానని తెలిపారు. నగర శివారులోని మాధవనగర్, అర్సపల్లి, అడవి మామిడిపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. కోట్లల్లో నిధులు రావాల్సి ఉందన్నారు.
ప్రధానంగా మాధవనగర్కు సంబంధించి రూ.3 కోట్లు, రివైజ్డ్ నిధులు రూ.8.5 కోట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. అర్సపల్లి భూమికి సంబంధించి సుమారు రూ.10 కోట్లు హోల్ లో ఉన్నాయన్నారు. వీటికి సంబంధించి వారం రోజుల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని కలుస్తానని పేర్కొన్నారు.