ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక
చొప్పదండి ఏప్రిల్ 28 (విజయ క్రాంతి): సోమవారం ఈరోజు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక చైల్ సేఫ్టీ మరియు ప్రొటెక్షన్ లో భాగంగా చొప్పదండి మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించనైనది, ఈ సందర్భంగా కిశోర బాలికలకు పోషకాహారం ప్రాముఖ్యత గురించి వివరించనైనది, బాల్యవివాహాల గురించి వివరించనైనది
ఆడపిల్ల లు బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని కొత్తవారిని నమ్మవద్దని, ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 1098 కు,181కు ,100 కు ఫోన్ చేయవచ్చు అని చెప్పనైనది, బయట జంక్ ఫుడ్ లాంటివి కాకుండా ఇంట్లో వండిన ఆహార పదార్థాలను తీసుకోవాలి అని చెప్పడం జరిగింది, ఆరోగ్య జాగ్ర త్త కూడా చెప్పడం జరిగింది
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి వేణుగోపాల్ మున్సిపల్ కమిషనర్ మనోహర్ హెల్త్ డిపార్ట్మెంట్ సురేందర్ సూపర్వై జర్స్ సుధారాణి మస్రత్ సంపత్, శైలజ, సంగీత , సఖి కిశోర బాలికలు పాల్గొన్నారు






