calender_icon.png 19 December, 2025 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందమర్రిలో 88.21 శాతం పోలింగ్

18-12-2025 12:00:00 AM

మందమర్రి, డిసెంబర్ 17 : మందమర్రి మండలంలో పది గ్రామ పంచాయతీలుండగా ఒక జీపీ ఏకగ్రీవం కాగా తొమ్మిది జీపీలకు, 86 వార్డులలో 21 వార్డులు ఏకగ్రీవం కాగా 65 వార్డులకు బుధ వారం ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. తొమ్మిది జీపీలకు 38 మంది, 65 వార్డులకు 186 మంది పోటీపడ్డారు. మొత్తం 11,127 (5,502 పురుషులు, 5,624 మహిళలు, ఇతరులు ఒకరు) మంది ఓటర్లుండగా 9,815 (4,854 పురుషులు, 4,960 మహిళలు, ఇతరులు 1)కి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసే సరికి 88.21 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. 

విజయం సాధించిన సర్పంచులు వీరే...

మండలంలోని పది గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన నలుగురు, ఇండిపెండెంట్లు నలుగురు, బీఆర్‌ఎస్ బలపర్చిన ఇద్దరు విజయం సాధించారు. మండలంలోని శంకర్ పల్లి జీపీ సర్పంచుగా పెరుమాల్ల వెంకటేష్ (కాంగ్రెస్ రెబల్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదిల్ పేట జీపీ సర్పంచుగా నిండుకూరు పున్నం (ఇండిపెండెంటు), సారంగపల్లి (తుర్కపల్లి) సర్పంచుగా బచ్చలి రాములు (ఇండిపెండెంటు), పులిమడుగు సర్పంచుగా భుక్య బుజ్జి (ఇండిపెండెంటు), మామిడిగట్టు సర్పంచుగా సుంకరి దివ్య సతీష్ (ఇండిపెండెంటు), అందుగుల పేట సర్పంచుగా ముత్యం రమ (కాంగ్రెస్), బొక్కలగుట్ట సర్పంచుగా మాసు శ్రీనివాస్ (కాంగ్రెస్), చిర్రకుంట సర్పంచుగా రాంటెంకి శ్రీలత తిరుపతి (కాంగ్రెస్), పొన్నారం సర్పంచుగా పెంచాల మధు (బీఆర్‌ఎస్), వెంకటాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచుగా సేగ్యం వెంకటేష్ (బీఆర్‌ఎస్) విజయం సాధించారు.