23 June, 2026 | 10:42 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

మున్సిపల్ ఓటర్ జాబితాలో చిత్రవిచిత్రాలు

06-01-2026 12:34 AM

భద్రాద్రి కొత్తగూడెం జనవరి 5, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్ల జాబితాలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఓ డివిజన్ పరిధిలో ఇండ్లు లేకున్నా ఓట్లు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేదర్ బస్తి 51వ డివిజన్ ఏర్పాటయింది. సంవత్సరాలుగా రైల్వే శాఖకు చెందిన స్థలంలో సుమారు 70 నుంచి 100 కుటుంబాలు ఇండ్లు నిర్మించుకునే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రైల్వే అధికారులు నాలుగు సంవత్సరాల క్రితం  నివాసం ఉన్న వారిని ఖాళీ చేయించి ఇండ్లను కూల్చివేశారు.

జనాభా లేరు ఓట్లు పదిలం..

నాలుగు సంవత్సరాల క్రితం ఖాళీ అయిన 51 డివిజన్ పరిధిలో 7-1 బ్లాక్ మేదర్ బస్తి, తుమ్మల నగర్ ప్రాంతంలో ని ఓటరు జాబితాలో సుమారు 250 మంది ఓటర్లు నమోదయి ఉన్నారు. గతంలో ఇక్కడ నివాసం ఉన్న వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు, అయినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓటర్ల జాబితాలో వాళ్ల పేర్లు పదిలంగా ఉన్నాయి. మున్సిపల్ అధికారుల పనితీరుకు చక్కని తార్కాణం. సంబంధిత మున్సిపల్ సిబ్బంది ఈ విషయంపై ప్రశ్నిస్తే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని సమాధానమివ్వటం గమనార్హం.