13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ప్రజలను మభ్య పెట్టేందుకే శంకుస్థాపనలు

09-01-2026 03:27 PM

బిఆర్ఎస్ నాయకులు

అనుమతి లేకుండా పనులు ప్రారంభించడంపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు  వినతిపత్రం అందజేత 

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఎలాంటి అధికారిక హోదా లేని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్యామ్ నాయక్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ బిఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ మేనేజర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల స్టంట్లకు పాల్పడుతున్నారని వారు విమర్శించారు.

స్థానిక ఎమ్మెల్యేకు కూడా సమాచారం ఇవ్వకుండా, ప్రోటోకాల్ లేని వ్యక్తులతో హడావిడిగా శంకుస్థాపనలు చేయడం చట్టవిరుద్ధమని, ఇలాంటి చర్యలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత పనులకు మున్సిపాలిటీ వద్ద ప్రస్తుతం ఎలాంటి నిధులు లేవని, అలాగే ఎలాంటి సాంక్షన్లు లేదా అధికారిక ప్రొసీడింగ్స్ కూడా లేవని మున్సిపల్ కమిషనర్‌ స్పష్టం చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిలువేరు వెంకన్న, టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్‌ నాయకులు సయ్యద్ నిస్సార్, దుడేలా అశోక్, చౌదరి రవి, జావేద్, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.