13 April, 2026 | 4:20 PM

Breaking News

ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •   కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్   •  

పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు జగన్నాథ రథయాత్ర ఆహ్వానం

03-07-2025 02:24 AM

నిజామాబాద్ జూలై 2: (విజయ క్రాంతి): వచ్చే శుక్రవారం ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ జగన్నాథ రథయాత్ర ఆహ్వానాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కు ఇస్కాన్ ప్రతినిధుల బృందం అందజేసింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం నిర్వహిస్తున్న సేవా మరియు శిక్షణ కార్యక్రమాలను అడిగి తెలుసుకుని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది, వేసవి లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరం యొక్క ముగింపు కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథిగా వెళ్లిన సమయంలో ఎంతో ప్రశాంతత మరియు భక్తి అనుభూతి చెందినట్లు కమిషనర్ ఇస్కాన్ బృంద సభ్యుల కు ఆయన తెలిపారు.

జగన్నాథ రథయాత్ర వైభవోపేతంగా నిర్వహించడం కోసం తన యొక్క పూర్తి సహాయ సహకారాలు మరియు పోలీసు శాఖ తరపున కూడా పూర్తి సహకారాన్ని అందిస్తామని, ప్రశాంతమైన వాతావరణంలో రథయాత్రను జరుపుకోవాలని సిపి సూచించరూ.ఆహ్వానాన్ని అందించిన వారిలో ఇస్కాన్ కంటేశ్వర్ కేంద్రం అధ్యక్షులు రామానంద రాయ్ ప్రభుదాస్, స్వామి యాదవ్ మరియు కమిటీ సభ్యులు ఉన్నారు.