14 April, 2026 | 1:20 PM

Breaking News

అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •   బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం— వందేళ్ల నష్టానికి దారి తీసింది   •   డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం రేవంత్ ఘన నివాళి   •   ఒంగోలు దారుణ ఘటన: బతికుండగానే తల్లికి నిప్పు పెట్టిన కుమారుడు!   •  

ఫేక్ కరెన్సీ ముఠాపై పోలీసుల ఉక్కుపాదం.. ముగ్గురు అరెస్ట్

23-11-2025 04:47 PM

కామారెడ్డి (విజయక్రాంతి): అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠా సభ్యుల్లో మరో ముగ్గురు సభ్యులను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదివారం వెల్లడించారు. నకిలీ నోట్ల ముఠా సభ్యుల్లో మరి కొంతమంది తప్పించుకొని తిరుగుతుండగా ఛత్తీస్ గఢ్ లో మరో ముగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి ₹1,70,500 ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

అంతర్రాష్ట్ర ఫేక్ కరెన్సీ నోట్ల తయారీ ముఠా పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ కేసులో పోలీసులు గతంలో ఢిల్లీ, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో గాలింపు చేపట్టి ఫేకు నోట్ల ముఠా లోని 8 మంది నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇందులో ప్రధాన నిందితుడు అయిన కరెన్సీ కాట్నీపై ఇటీవల పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారు. తాజాగా ఈ ముఠాలోని మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.