calender_icon.png 15 September, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దువ్వాడ శ్రీనివాస్‌కు పోలీసుల నోటీసులు

14-12-2024 04:38:20 PM

అమరావతి: శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు పోలీసులు శనివారం సెక్షన్‌ 41-ఎ నోటీసులు జారీ చేశారు. అక్కవరం గ్రామ సమీపంలోని శ్రీనివాస్ నివాసాన్ని సందర్శించిన పోలీసులు నోటీసును అందజేశారు. తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై జనసేన నేతలు టెక్కలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం గమనార్హం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై శ్రీనివాస్ కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు టెక్కలి పోలీసులు నోటీసులు జారీ చేశారు.