2 July, 2026 | 2:55 PM

Breaking News

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •  

ప్రశాంతంగా పాలిసెట్ ప్రవేశ పరీక్ష

13-05-2025 05:29 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాలిసెట్-2025 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పాలిసెట్(POLYCET) ప్రవేశ పరీక్ష ఎలాంటి అసౌకర్యాలు అవరోధాలకు తావు లేకుండా జరిగింది. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాశారు. ప్రత్యేకించి బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో అభ్యర్థుల హాజరు శాతాలు ఉత్తేజకరంగా నమోదయ్యాయి. బెల్లంపల్లిలో 1081 మందికి గాను 1026, మంచిర్యాలలో 2558 మందికి గాను 2397, ఆసిఫాబాద్ లో 1032 మందికి గాను 965, నిర్మల్ లో 2422 మందికి గాను 2305, ఆదిలాబాద్ లో 1102 మందికి గాను 1026 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారు.

మంచిర్యాల, కొమురం భీం, ఆదిలాబాద్ జిల్లాల కోఆర్డినేటర్ డాక్టర్ M. దేవేందర్ రెడ్డి (ప్రిన్సిపాల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, బెల్లంపల్లి) సమర్థవంతంగా పర్యవేక్షించారు. రాష్ట్ర సాంకేతిక విద్యామండలి (SBTET) నుండి స్పెషల్ అబ్జర్వర్ గా తారాసింగ్ పర్యవేక్షించారు. అసిస్టెంట్ కోఆర్డినేటర్ గా బి వెంకటేశ్వర్లు, డీఈవో కార్యాలయం, మంచిర్యాల నుండి  పి మహేశ్వర్ రెడ్డి, కలెక్టరేట్ మంచిర్యాల నుంచి డీటీ లక్ష్మీ నారాయణ బెల్లంపల్లి ఎస్ హెచ్ ఓ దేవయ్య, అధికారులు సమన్వయంతో పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు. కోఆర్డినేటర్ డాక్టర్ దేవేందర్ రెడ్డి ప్రతి ఒక్కరికి ప్రశంసించారు.