17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

బీసీ బంద్ ప్రశాంతం

18-10-2025 07:52 PM

- సంపూర్ణ మద్దతు తెలిపిన వర్తక సంఘాలు 

- బంద్ లో పాల్గొన్న రాజకీయ నాయకులు

మంగపేట,(విజయక్రాంతి): బీసీలకు రాజ్యాంగ బద్ధంగా రాజకీయ విద్య ఉద్యోగాలలో 42% రిజర్వేషన్ కల్పించే విధంగా పార్లమెంటులో చట్టాలు చేసి తొమ్మిదొవ షెడ్యూల్ ప్రకారం బీసీల రిజర్వేషన్ అమలుకు చట్టబద్ధత కల్పించాలని శనివారం తలపెట్టిన బీసీ బంద్ కు మండల కేంద్రంలోని పెట్రోల్ బంకులు మెడికల్ షాపులు మినహా వర్తక సంఘాలు దుకాణాలు, బ్యాంకులు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు సైతం మూసి వారి సంపూర్ణ మద్దతును తెలియజేశారు. బీసీ బంద్ కు మండలంలోని అన్ని రాజకీయ పార్టీ నాయకులు పాల్గొని సంఘీభావాన్ని తెలిపారు. ఇందులో భాగంగా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఉదయం నుండి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.