calender_icon.png 25 August, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గురు ఐఏఎస్‌లకు పోస్టింగ్

10-01-2025 01:49:56 AM

హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు వెయిటింగ్‌లో ఉన్న ఐఏఎస్ యోగి తా రాణాను విద్యాశాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. మైన్స్ అండ్ జియాలజీ కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ సురేంద్ర మోహన్ రవాణా శాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న ఎన్ శ్రీధర్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.