15 June, 2026 | 7:21 PM

Breaking News

అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •  

పోలీస్ సర్కిల్ ఏర్పాటుకు సన్నాహాలు

01-10-2025 09:58 PM

తొలి సీఐగా సత్యనారాయణ

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో కొత్తగా పోలీస్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కేసముద్రం పోలీస్ సర్కిల్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లికుదురు, కేసముద్రం పోలీస్ స్టేషన్లతో పాటు నూతనంగా ఏర్పాటు కానున్న ఇనుగుర్తి పోలీస్ స్టేషన్ లను కేసముద్రం సర్కిల్ పరిధిలోకి చేర్చారు. ఈ క్రమంలో కేసముద్రం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న ఎస్ ఐ క్వార్టర్ లో సీఐ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఈ మేరకు సర్కిల్ కార్యాలయానికి అవసరమైన ఫర్నిచర్, ఆఫీస్ గది ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. దసరా రోజు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉంటుందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. 

కేసముద్రం తొలి సీఐగా సత్యనారాయణ

నూతనంగా ఏర్పడ్డ కేసముద్రం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రస్తుతం డీ.సీ.ఆర్.బిలో సీఐగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణను నియమించినట్లు పోలీస్ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు తొలి సీఐగా సత్యనారాయణ గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు.