01-10-2025 11:21:18 PM
హైదరాబాద్: మాజీ మంత్రి, సూర్యపేట నియోజకవర్గ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి(73) కన్నుమూశారు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తుంగతుర్తిలో 4వ తేదీ సాయంత్రం దామోదర్ రెడ్డి అంతిమసంస్కారాలు చేయనున్నారు. కాగా, దామోదర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో ఐటీ మంత్రిగా పనిచేశారు. అలాగే ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు.