15 June, 2026 | 11:16 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తహసిల్దార్

01-10-2025 10:14 PM

బెజ్జూర్ (విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయ ప్రాంగణంలో తులసి వన మహోత్సవం ఏర్పాటు తహసీల్దార్ రామ్మోహన్, ఆలయ కమిటీ అధ్యక్షుడు తంగిడిపల్లి మహేష్ నాటారు. ఆలయ ప్రాంగణంలో తులసి మొక్కలు నాటారు. తులసి మొక్కలు నాటడం అభినందనీయమని భక్తులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి తులసిమాల అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో పూజకు ఉపయోగపడే ప్రతి ఒక్క నాటేందుకు కమిటీ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగ్గా గౌడ్, మాజీ ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీ వర్ధన్, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.