15 June, 2026 | 10:03 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

భద్రకాళి శరన్నవరాత్రోత్సవాల ముగింపుకు కేసీఆర్ కు ఆహ్వానం

01-10-2025 10:11 PM

హనుమకొండ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బుధవారం సాయంత్రం ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళీ అమ్మవారి దేవస్థానంలో జరిగిన శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా, అమ్మవారి ప్రసాదాన్ని, అమ్మవారి వద్ద ఉంచిన పట్టువస్త్రాలను అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కి దాస్యం వినయ్ భాస్కర్ దసరా శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వాదం తీసుకున్నారు.