09-07-2025 12:00:00 AM
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల్ టౌన్ జూలై 8: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో మంగళవారం సీఎం సహాయ నిధికి నమోదు చేసుకున్న లబ్ధిదారులకు మంజూరు అయిన చెక్కులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అందచేశారు. వచ్చిన చెక్కులను తమ ఆరోగ్య అవసరాల నిమిత్తం వినియోగించు కోవాలని ఎమ్మెల్యే లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్ర మంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.