12-01-2026 12:50:51 AM
వేములవాడ,జనవరి11(విజయక్రాంతి): ప్రజా ఆరోగ్యనికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేములవాడ అర్బన్ మండలం పరిధిలో అర్హులైన 25 మంది లబ్ధిదారులకు 07 లక్షల 95 వేల విలువచేసే చెక్కులను 30 మంది లబ్ధిదారులకు 8 లక్షల 91 వేల విలువైన ముఖ్యమంత్రి సహయ నిది చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వైద్యపరంగా ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.