15 April, 2026 | 12:55 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రభుత్వానికి ‘ప్రైవేట్’ సమ్మె నోటీస్

23-10-2025 12:57 AM

నవంబర్ 1 లోగా రూ.900 కోట్లు విడుదల చేయాలని డిమాండ్

3 నుంచి కాలేజీలు బంద్ చేస్తామని అల్టిమేటం

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిలు  విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి ప్రైవేట్ విద్యాసంస్థల సమాఖ్య నాయకులు సమ్మె నోటీసులిచ్చారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బుధవారం కలిసి నోటీసులు అందజేశారు. రూ.1200 కోట్లలో ఇప్పటి వరకు రూ.300  కోట్లే విడుదల చేశారని, మిగిలిన రూ.900 కోట్లు నవంబర్ 1 వరకు విడుదల చేయాలని, లేకుంటే  అదే నెల 3నుంచి ఇంజినీరింగ్‌తో సహా అన్ని ప్రొఫెషనల్, డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్ నిర్వహిస్తామని నోటీసులో పేర్కొన్నట్లు ప్రైవేట్ విద్యాసంస్థల నాయకులు తెలిపారు.

డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో ప్రైవేట్ విద్యాసంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు, సెక్రటరీ జనరల్ ఎస్.రవికుమార్, ట్రెజరర్ కృష్ణారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సునిల్ కుమార్ ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రైవేట్ ఫార్మసీ, బీఎడ్ కాలేజీల గౌరవాధ్యక్షుడు రాందాస్‌తో పాటు పలువురు మంత్రి ఉత్తమ్‌ని సూర్యాపేటలో కలిసి సమ్మె నోటీసులందించారు.