8 March, 2026 | 3:37 PM

Breaking News

ఆన్‌లైన్ పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రులు   •   ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష   •   అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •  

ముషీరాబాద్‌లో సదర్ వేడుకలు

23-10-2025 11:45 PM

తెల్లవారుజాము వరకు జనంతో కిక్కిరిసిన రోడ్లు

ముషీరాబాద్ (విజయక్రాంతి): ముషీరాబాద్ లో సదరు ఉత్సవాలు తెల్లవారుజాము వరకు అంగరంగ వైభవంగా కొనసాగాయి. డప్పుల దరువులు, యువతుల నృత్యాలు, కళాకారుల ప్రదర్శనలు, దున్నపోతులు విన్యాసాలతో సదరు ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగాయి. తెలంగాణ రాష్ట్ర సదరు ఉత్సవ సమితి ఉపాధ్యక్షుడు ఎడ్ల హరిబాబు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సదరు వేడుకల్లో హరియానా రాష్ట్రానికి చెందిన గోలు, భజరంగి, బాద్, కోహినూరూ, పంజాబ్ రాష్ట్రానికి చెందిన రోలాక్స్ తదితర భారీ దున్నలు సదరు వేడుకల్లో ఆకర్షనీయంగా నిలిచాయి. దున్నరాజుల విన్యాసాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం రావడంతో రోడ్లన్ని కిక్కిరిసి పోయాయి. ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై దున్నలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు వరుణ్, అభినందన్, సాయి, సయ్యద్ అహ్మద్ భక్తియార్, ఖధీర్, సదా తదితరులు పాల్గొన్నారు.