14-07-2025 10:43:00 PM
తోల్కట్ట గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతి..
చేవెళ్ల: మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటేందుకు భూమి కేటాయించాలని సంఘం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి భానూరి శివ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రజావాణిలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో సర్వే నెంబర్ 137/అ3 లో 2 ఎకరాలు, 137/ఊ లో 2.34 ఎకరాలు, 124లో 1.33 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని వివరించారు. ఈ సర్వే నెంబర్ల గుండా వాగు ఉంటుందని, దీనికి ఇరువైపులా తోల్కట్ట గౌడ సంఘం (రిజిస్టర్ నెం. 827/2022) ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటేందుకు భూమిని కేటాయించాలని కోరారు. దీన్ని వల్ల కల్లు ఉత్పత్తికి తమకు అవకాశం, ఆదాయం లభించడమే కాకుండా.. వాగు కోతకు గురికాకుండా ఉంటుందని చెప్పారు.