11 May, 2026 | 9:09 PM

Breaking News

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •   శివంపేట మండలంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు పంపిణీ!   •   పాలిసెట్–2026 పరీక్షా ఏర్పాట్లు పూర్తి   •   ప్రధాని మనసు గెలిచిన గరిడేపల్లి 'డప్పు దరువు'   •   జనగణన సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ అక్షరా శ్రీనివాస్   •   మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ ఆవిష్కరణకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆహ్వానం   •   ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   క్షతగాత్రురాలుకి అండగా చేయూత ట్రస్ట్   •   సమ్మర్ క్యాంప్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •  

శ్రీశ్రీ వీరభద్ర దేవాలయంకు కావలసిన సదుపాయాలు కల్పించండి

21-09-2025 12:25 AM

జిల్లా మంత్రిని కోరిన కాటా శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు

గుమ్మడిదల: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులపై పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇం‌ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్,  మంత్రి దామోదర్ రాజనర్సింహని కలిశారు. దేవాలయ అభివృద్ధి పనులకు కావలసిన సదుపాయాలపై చర్చించి, తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రివర్యులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాపరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, గుమ్మడిదల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింగ్ రావు, జిన్నారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్డె కృష్ణ, మాజీ ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.