3 July, 2026 | 11:13 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

25-07-2024 12:05 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 24 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాల విద్యార్థు లకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. బుధవారం ఆయన బహదూర్‌పుర ఉమ్డా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా బడుల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు అంశాలపై సూచనలిచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉం చాలని సూచించారు. విద్యార్థుల హాజరును ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. పర్యటనలో డీఈవో రోహిణి, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి ఆశన్న, డిప్యూ టీ డీఈవో ఏ సత్యవతి ఉన్నారు.