15 April, 2026 | 12:58 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

శరవేగంగా అభివృద్ధి పనులు

15-12-2025 05:27 PM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. 

మాదారంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. 

జిన్నారం/అమీన్ పూర్: గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డులో శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పటాన్ చెరు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మాదారం గ్రామంలో 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న యుజిడి పనులకు సోమవారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, గ్రామ మాజీ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య, డిఈ నరసింహ రాజు, సీనియర్ నాయకులు, గ్రామ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు .