15-12-2025 06:16:49 PM
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి మీర్ ఫిరాసత్ అలీ బక్రీ సోమవారం ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు, ముస్లిం రాష్ట్రీయ మంచ్ పోషకులు డా. ఇంద్రేష్ కుమార్ను కలిశారు. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, పీజీఆర్ఆర్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆడిటోరియంలో 'ఒక దేశం, ఒక మాతృభూమి - భారతదేశం' అనే అంశంపై జరిగిన ఐక్యత, మత సామరస్యం కోసం పిలుపునిచ్చే సెమినార్లో ఆయనను సత్కరించారు.