17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

త్వరలో సీసీ రోడ్డు, కరెంట్ పోల్ పనులు

15-12-2025 05:31 PM

రామచంద్రపురం: రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్‌నగర్ కాలనీ బస్‌రూట్‌లోని 14వ బ్లాక్‌లో డ్రైనేజీ పనుల వల్ల రోడ్డు గుంతలమయంగా మారింది. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు బూరుగడ్డ పుష్పనగేష్ అధికారులతో కలిసి బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీవాసులు నూతన కరెంట్ పోల్ అవసరమని కోరగా, వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపించారు. అలాగే సానిటేషన్ సమస్యలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వారంలోనే సీసీ రోడ్డు, కరెంట్ పోల్ పనులు ప్రారంభించి సమస్యలు పరిష్కరిస్తామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు.