calender_icon.png 22 July, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో జర్నలిస్టుల సమస్యలపై ఇక పోరాటాలకు సిద్ధం

21-07-2025 12:00:00 AM

పెద్దపల్లి, జూలై 20(విజయ క్రాంతి) తెలంగాణ లో ఇక జర్నలిస్టుల సమస్యలపై పోరాటాల కు సిద్ధంగా ఉండాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు నగునూరి శేఖర్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాలోని రామగిరి మండలం సెంటినరీ కాలనీ లోని సా యిరాం గార్డెన్ లో ఐజెయు అనుబంధ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(టిడబ్యూజెయు) పెద్దపల్లి జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు మల్లావజ్జుల వం శీవిద్యానంద్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా జాతీయ కౌన్సిల్ సభ్యులు నగునూరి శేఖర్ హాజరయ్యారు.

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి స్థలాల సమస్య పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం దీనిపై ప్రత్యేక జీవో తీయాలని డిమాండ్ చేశారు. అక్రిడేషన్ కార్డులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ప్రజాసమస్యలపై పాత్రికేయులు దృష్టి సారించాలని అన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.

ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు పొన్నం శ్రీనివాస్, జిల్లా సహాయకార్యదర్శిలు జ్యోతుల ప్రవీణ్, జబ్బార్ ఖాన్, ఈసి మెంబర్లు చింతం కిరణ్ కుమార్, గాదె బాలు, గసిగంటి రవీందర్, మల్యాల రమేష్, పాత్రికేయులు పివీరావు, బండ సాయి శంకర్, కొడారి మల్లేష్ యాదవ్, కాపర్తి వెంకటేష్, చిలుక సురేష్, పోలు మధు, సూత్రం శ్రీధర్, నల్లూరి లింగయ్య, మల్యాల రమేష్, ఉట్ల తిరుపతి రెడ్డి, ఏకు రవీందర్, దాసరి భరత్, సిద్ధం ప్రదీప్, గాజు రఘుపతి, ఇండ్ల అవినాష్, తదితరులుపాల్గొన్నారు.