7 May, 2026 | 2:07 PM

Breaking News

కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •   మంత్రి జూపల్లి చేతికి బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి   •   ఐమాక్స్ లైట్లు ఏర్పాటుకు భూమి పూజ   •   ‘విజయ్ అనే నేను’.. సీఎం పీఠం ఖాయం?   •   కేంద్రమంత్రి బండి సంజయ్‌పై కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •  

చూసి దాటండి అసలే నాసిరకం..

17-07-2025 10:34 PM

మహబూబ్ నగర్ రూరల్: ప్రభుత్వ పనులు అంటే చాలు నాసిరకంగా చేసి బిల్లులు చేసుకుంటే సరిపోతుంది అనుకుంటుంటారు కాంట్రాక్టర్లు. ఇందుకు అధికారులు కూడా తక్యం కాదు వారు కూడా చూసి చూడనట్టు ఉండి బిల్లులు చేస్తున్నారని ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలోని వార్డు నెంబర్ 4 లోని ఎదిరలో మోరిపై వేసిన పైకప్పు కుంగిపోవడంతో ప్రమాదం అంచున ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. అధికారులు స్పందించకపోవడంతో అక్కడ ఉన్న కాలనీవాసులు రాకపోకల ప్రాంతంలో కల్వర్టు పగిలిపోవడంతో బండలు ఉంచారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. అప్పటివరకు వాహన చోదకులు కానీ, పాదాచారులు గాని కాస్త చూసి పోవాల్సిందే.