17 April, 2026 | 10:30 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించాలని ఎంపీకి వినతి

27-11-2025 12:00 AM

మేడ్చల్ అర్బన్, నవంబర్ 26 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా టిపియుఎస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మల్కాజిగిరి బిజెపి పార్లమెంటు సభ్యులు  ఈటల రాజేందర్ ను కలిసి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్  నుంచి మినహాయించాలని వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా టీపీయూఎస్ రాష్ట్ర కార్యదర్శి గడప నవీన్ మాట్లాడుతూ శీతాకాల పార్లమెంటు సమావేశంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు జరిగేలా కృషి చేయాలని ఎంపి ఈటల రాజేందర్ ను కోరినట్లు నవీన్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మోడీ గారి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, జిల్లా సంఘటన కార్యదర్శి గోపాల్, సురేందర్, వెంకటేష్, మహేందర్, శ్రీనివాస్ రావు, తిరుపతి, సుధీర్, వెంకటరమణ, రామారావు  పాల్గొన్నారు.