26-11-2025 06:51:13 PM
తానూర్ (విజయక్రాంతి): తానూరు మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలకు చెందిన సిహెచ్ బాలాజీ రెజ్లింగ్ పోటీలో రాష్ట్రస్థాయికి ఎంపికైనట్టు ప్రధాన ఉపాధ్యాయులు సాయిరాజ్ తెలిపారు. అండర్-17 విభాగంలో 45 కేజీల పోటీలో జిల్లా స్థాయిలో ప్రతిభ సాధించి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడంతో బుధవారం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని సన్మానం చేశారు.