మళ్లీ పెరుగుతున్న బంగారం
తులం ధర రూ.72,710
వెండి రూ.2000 జంప్
బంగారం ధరతో పోలిస్తే వెండి ధర కాస్త అధికంగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర శుక్రవారం రూ.2,000 తగ్గి రూ.88,000 స్థాయికి చేరింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు వెండి ధర 27.20 డాలర్ల నుంచి 27.55 డాలర్ల వద్దకు పెరిగింది.
పెరుగుదలకు కారణమిది..
యూఎస్ జీడీపీ మార్చి త్రైమాసికంలో గణనీయంగా తగ్గినట్టు వెలువడిన గణాంకాలతో బంగారం ధర తిరిగి పుంజుకు న్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధి తెలిపారు. డిసెంబర్ త్రైమాసికంలో 3 శాతంపైగా వృద్ధి చెందిన అమెరికా జీడీపీ ఈ మార్చి త్రైమాసికంలో 1.6 శాతానికి పరిమితమయ్యింది. దీంతో ద్రవ్యోల్బణం ఒత్తిడితో ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందన్న అంచనాల కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణించే పుత్తడిలో పెట్టుబడి చేస్తున్నారని గాంధి వివరించారు.






