01-12-2025 05:15:34 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను సోమవారం విద్యాశాఖ ఆర్జేడి సత్యనారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యాబోధన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు చేపట్టిన పనులు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాల నిర్మాణాలు పాఠశాలలో విద్యాబోధన రైతుల అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న ఉపాధ్యాయులు ఉన్నారు.