1 July, 2026 | 7:57 PM

Breaking News

పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •  

మైత్రివనం వద్ద ఆర్‌ఆర్‌ఆర్‌ బాధిత రైతుల ధర్నా

08-09-2025 04:06 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): మైత్రివనం స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌లోని హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్ట్ బాధిత రైతులు సోమవారం ధర్నా చేపట్టారు. తమ భూములకు తగిన పరిహారం అందకుండా అన్యాయానికి గురవుతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు మాట్లాడుతూ.. “మన పారంపర్య భూములను ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్నా, ఇప్పటివరకు సరైన పరిహారం, పునరావాసం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి, మంత్రులు హామీలు ఇచ్చినా అమలు కాలేదు. మాకు న్యాయం జరగకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం” అని హెచ్చరించారు. హెచ్ఎండీఏ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్న రైతులు నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచారు.