31 August, 2026 | 9:29 AM

Breaking News

భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. బోనం ఎత్తిన ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి   •   క్రీడా స్ఫూర్తితో గెలపోటములను స్వీకరించాలి: ప్రాజెక్టు అధికారి రాహుల్   •   చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పొడిగించాలి   •   ఆదివాసి యువతి శిరీష కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలి   •   యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ గొప్ప అవకాశం   •   యావాపూర్ లో ఘనంగా బోనాలు   •   అత్యంత వైభవంగా బోనాల పండుగ   •   సాంబ శర్వాణి రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి   •   ఉమ్మడి మానాలలో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి   •   కౌకూర్ మోడల్ మార్కెట్ భవనం కోసం నాలుగో రోజు ధర్నా   •  

ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం

29-09-2025 12:06 AM

యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 28 ( విజయక్రాంతి ): ఆర్ ఎస్ ఎస్ శతాబ్ది ఉత్సవాలు  ఆదివారం భువనగిరిలో ఘనంగా ప్రారంభమయ్యాయి.  5 వేరు వేరు ప్రాంతాలలో ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు రూట్ మార్చ్ జరిపారు. ఈ సందర్భంగా జరిగిన  సమావేశాలలో ఆర్‌ఎస్‌ఎస్ తక్షణమాధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి సిరిగే శివకుమార్, రాష్ట్ర సేవా ప్రముఖ్ గాజుల శివశంకర్, విభాగ్ కార్యవాహ మంత్రి ప్రగడ శ్రీధర్, విభాగ్ వ్యవస్థా ప్రముక్ కమఠం రమేష్, జిల్లా సహకార్యవాహ కటకం లక్ష్మణ్ మాట్లాడుతూ  1925 విజయదశమి రోజున మహారాష్ట్ర నాగపూర్ లో డాక్టర్ కేశవరావు బలీరాం హెగ్డే వార్ ప్రారంభించిన ఆర్‌ఎస్‌ఎస్ నేడు ప్రపంచవ్యాప్తం అయిందన్నారు.

నిత్య శాఖ శాఖలలో శారీరక పట్టుత్వ, దేశహిత కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఏడాది పాటు శతాబ్ది ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. స్వయం సేవకుల రూట్ మార్చ్ ఆకట్టుకుంది.  ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సంఘచాలక్ బాదం ప్రకాష్, పట్టణ కార్యవాహ ఎమికే శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.