07-05-2025 05:06:28 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న బస్ డ్రైవర్ మహేష్ బుధవారం నిజాయితీని చాటుకున్నారు. నిర్మల్ డిపోలో విధులు నిర్వహిస్తున్న మహేష్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బస్సులో వెళుతుండగా భూమేష్ అనే ప్రయాణికుడు తన బ్యాగును బస్సులోనే మరిచి వెళ్లిపోయాడు. ఆ బ్యాగును గమనించగా 21 వేల నగదు, సెల్ఫోన్ ఉండడంతో అతని చిరునామా ద్వారా సమాచారం అందించి సీఐ ఆధ్వర్యంలో అతనికి అప్పగించారు. నిజాయితీని చాటుకున్న డ్రైవర్ కు ఆర్టీసీ సిబ్బంది అభినందనలు తెలిపారు.