17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

అప్పుడు బాలాకోట్.. ఇప్పుడు ‘సిందూర్’!

08-05-2025 12:50 AM

న్యూఢిల్లీ, మే 7: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. దాయాది దేశాన్ని ఏమార్చి అత్యంత పకడ్బందీగా దాడుల ప్రణాళిక అమలుచేసింది. ప్రధాని మోదీ వ్యూహాలు కీలకంగా పనిచేశాయనడంలో సందేహం లేదు.

గతంలో బాలాకోట్ దాడులకు ముందు కూడా ఇలాంటి వ్యూహాలనే ప్రధాని మోదీ అమలుచేశారు. దాడులకు ముందు అంతా ప్రశాంతంగానే ఉన్నట్లు కనిపించినా.. దాడులతో దాయాది దేశానికి ముచ్చెమటలు పట్టించారు. గతంలో బాలాకోట్ దాడి, ప్రస్తుత సిందూర్ దాడికి మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. వీటిని పసిగట్టడంలో పాక్ విఫలమైంది.

బాలాకోట్ దాడులకు ముందు..

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్‌పై భారత్ దాడులు చేసింది. ఆ దాడికి 48గంటల ముందు ప్రధాని మోదీ ఎప్పటిలాగానే ఎం తో ప్రశాంతంగా పనుల్లో నిమగ్నమయ్యా రు. అదేరోజు రాత్రి 9 గంటలకు భారత వాయుసేన దాడులకు సిద్ధమవుతుండగా.. ప్రధాని మోదీ ఢిల్లీలో ఓ మీడియా సమావేశంలో.. అభివృద్ధి, భారత ఆకాంక్షలు, ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడంపై ప్రసంగించారు. ఆ సమావేశంలో ఆయన ఎంతో ప్రశాంతంగా కనిపించారు. అయితే ఆ రాత్రే భారత బలగాలు బాలాకోట్ దాడులు చేసి తమ పనిని విజయవంతంగా ముగించాయి.

ఇప్పుడు ఇలా..

బాలాకోట్ దాడికి ముందు ప్రధాని మోదీ ఎంత ప్రశాంతంగా కనిపించారో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. మంగళవారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారత్ జలాలను ఇక నుంచి దేశం దాటనివ్వబోమన్నారు. దాదాపు 30నిమిషాలు ప్రసం గించినా ఆయన ముఖంలో ఎక్కడా ఆందోళన కనిపించలేదు. అలాగే బుధవారం దేశం లో పలుచోట్ల మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేశారు.

దేశ ప్రజలను సైనిక చర్య కు, దాని పరిణామాలకు సిద్ధం చేస్తున్నారని అంతా భావించారు. అయితే ఇదంతా దా యాదిని ఏమార్చడానికే అని ఎవరూ ఊ హించలేకపోయారు. ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి పాకిస్థాన్‌ను ఉక్కిరి బిక్కిరి చేశారు. దాయాది దృష్టి మరల్చి దాడి చేయడంలో మరోసారి భారత బలగాలు విజయవంతమయ్యాయి.