28 June, 2026 | 3:45 PM

Breaking News

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •  

రెడ్డి సంఘం అధ్వర్యంలో సహన రెడ్డికి ఘన సన్మానం

16-11-2025 08:42 PM

మంథని (విజయక్రాంతి): పీజీ జనరల్ మెడిసిన్ లో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించిన సహన రెడ్డిని ఆదివారం సాయంత్రం మంథని రెడ్డి సంక్షేమ సంఘం భవనంలో రెడ్డి సంఘం అధ్యక్షులు ముసుకుల సురేందర్ రెడ్డి అధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో పీజీ జనరల్ మెడిసిన్ లో 9వ ర్యాంకు సాధించిన సహన రెడ్డిని అభినందించారు. ఇదే పట్టుదలతో చదివి మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. సహనారెడ్డిని ఇప్పటి యువత ఆదర్శంగా తీసుకుని చదువులో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు.