20-06-2025 12:18:21 AM
అడ్డు వచ్చిన టీఎండీసీ సిబ్బందిపై దాడి చేసిన వైనం
పోలీసులకు ఫిర్యాదు చేసిన టీజీఎండిసి అధికారుల ఫిర్యాదు
మహబూబ్ నగర్ జూన్ 19 (విజయ క్రాంతి) : రోజురోజుకు ఇసుక వ్యాపారుల దందా కాదు కాదు దౌర్జన్య వ్యాపారానికి అ డ్డు అదుపు లేకుండా పోతుంది. అర్థరాత్రి ఇసుక రీచుల దగ్గర అధికారులు పహారా చే సిన మీరు మమ్మల్ని ఆపేది ఏంటంటే దౌర్జ న్యం చేస్తూ తమ వ్యాపారమే పరమ అవధిగా అక్రమ సంపాదనకు ఇసుక వ్యాపా రులు అలవాటు పడిపోయారు.
అడ్డువచ్చిన అధికారులైన మరెవరైనా ఎదిరించి తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు.. ఆరు కాయలుగా చేసుకునేందుకు అత్యంత ఆత్రుత కన బరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి మిడ్జిల్ మండలం పరిధిలోని కొత్తపల్లి వాగులో టీజీఎండిసి ఏర్పాటుచేసిన రిచ్ కి కొందరు జెసిబి, భారత్ బెంజీలతో చేరుకున్నారు. అక్కడ ఉన్న అధికారులను సైతం భయభ్రాంతులకు గురిచేసి తమ వ్యాపారానికి అడ్డు రావద్దని బెదిరింపులకు పాల్పడి నట్లు తెలిసింది.
అడ్డు వస్తే అంతే....
ఇసుక వ్యాపారానికి అడ్డు ఎవరు వచ్చిన ఇక వారి అంతం చూస్తామనేలా కొందరు ఇసుక వ్యాపారులు కొత్తపల్లి వాగులో బుధవారం రాత్రి దౌర్జన్యం చేశారని టీజీఎండిసి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి రీచ్ దగ్గర ఉన్న సిబ్బందిపై దాడి చేయడంతో పాటు వారి దగ్గర ఉన్న సెల్ ఫోన్లను కూడా ఇసుక వ్యాపారులు లాక్కున్నట్లు తెలుస్తుంది.
ఈ విషయాన్ని తెలు సుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి అక్కడ ఉన్న నాలుగు టిప్పర్లను, ఒక జెసిబి ని అదుపులోకి తీసుకున్నారని పలువురు పేర్కొంటున్నారు. మరో ఆరు భారత్ బెంజీ లు కూడా వచ్చి వెళ్ళిపోయాయని స్థానికు లు పేర్కొంటున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి అక్రమ ఇసుక దందచేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజా పాలనలో ఇదేం దౌర్జన్యం....
ప్రజా పాలన ప్రతి ఒక్కరికి మేలు చేస్తుందని చెబుతున్న ప్రభుత్వం లో ఇసుక వ్యా పారులు ఇంత మేరకు దౌర్జన్యం చేసేలా ఎం దుకు అవకాశాలు కల్పిస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. క్షణికావేశం లో అడ్డు వచ్చిన వారిపై దాడి చేస్తే వారిని నిలుపుదల చేసేది ఎవరని ప్రశ్నల వర్షం కురిపిస్తుండ్రు.
నిబంధన మేరకు ఇసుక రీచ్ ల నుంచి ఇసుక తరలించాల్సి ఉండగా కొం దరు అక్రమంగా అర్ధరాత్రి ఇసుక రీచ్ లకు వచ్చి దౌర్జన్యం చేయడం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకి రక్షణ లేకుంటే ప్రజలకు ప్రజాపాలన ప్రభు త్వం ఎలా రక్షణ కల్పిస్తుందని ప్రశ్నిస్తున్నా రు. స్థానిక నాయకులు ఇప్పటికైనా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేసి అక్రమ దందాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఫిర్యాదు అందింది.. దర్యాప్తు చేస్తున్నాం..
ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. అక్రమంగా ఎన్ని వాహనాలు వె ళ్లాయి.. అన్ని పరిశీలిస్తున్నాం. ఈ విషయం పై ఫిర్యాదు కూడా టీజీఎండిసి వారు చేయ డం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు వాహనాలను, జెసిబి పై సీజ్ చేసి పూర్తిస్థాయిలో విచారణ చేయడం జరుగుతుంది.
శివ నాగేశ్వర్ నాయుడు, ఎస్ఐ, మిడ్జిల్ మండలం