15-09-2025 07:04:57 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలో ఈ నెల 12,13,14 తేదీలలో జరిగిన రాష్ట్ర స్థాయి విజ్ఞానమేలలో శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు సంస్కృతి బోధపరియోజన ప్రశ్నమంచ్ అంశంలో పాల్గొని దక్షిణ భారత విజ్ఞానమేళకు ఎంపికయ్యారు.ఎంపికైన విద్యార్థులు కల్లూరి చరణ్ సాకేత్, హరిచరణ్ గుత్తి వెంకటరత్న ఈనెల 18, 19 ,20 తేదీలలో హైదరాబాదులో జరుగు పోటీలలో పాల్గొంటారని ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. గెలుపొందిన విద్యార్థులను ప్రబంధకారిణీ ,ఆచార్యబృందం విద్యార్థులు అభినందించారు.