22 June, 2026 | 2:27 PM

Breaking News

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •  

విద్యార్థుల భద్రత కోసం స్కూల్ జోన్ బోర్డు, బస్ రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు

02-01-2026 07:05 PM

సీఐ బాలాజీ వరప్రసాద్

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఆదర్శ పాఠశాల, బీఈడీ, డిగ్రీ కళాశాలల విద్యార్థుల భద్రతను మరింత పెంచే ఉద్దేశంతో స్కూల్ జోన్ బోర్డు,  బస్ రిక్వెస్ట్ స్టాప్‌ను ఏర్పాటు చేసినట్లు  సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు నెమ్మదిగా వాహనాలు నడపాలని, విద్యార్థులు రోడ్డు దాటేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

రోడ్డు ప్రమాదాలను నివారించడమే ప్రధాన లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.ఈ ఏర్పాట్ల వల్ల విద్యార్థులు రోడ్డు దాటడం మరింత సురక్షితంగా మారుతుందని, తల్లిదండ్రులు కూడా నిశ్చింతగా ఉండాలన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు,తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు  సీఐని అభినందించారు.