15 April, 2026 | 7:12 AM

మంత్రి భోజనం ముచ్చట

24-11-2025 07:24 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడు గురుకుల పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంపీ నాగేష్ మాజీ మంత్రి ఇంద్రకన్ రెడ్డి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బుజ్జి పటేల్ తో  విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

భోజనం చేస్తూనే విద్యార్థులతో ముచ్చట పెట్టి ప్రతిరోజు భోజనం ఇలాగే ఉంటుందా అని ఆరా తీయగా ఎస్ అనడంతో సంతోషం వ్యక్తం చేశారు బాగా చదువుకోవాలి పైకి రావాలి మీ కోసం ప్రభుత్వం ఎంతో కష్టపడుతుంది చదువుకుంటారా అంటూ ప్రోత్సహించారు ప్రిన్సిపల్ ప్రశాంతిని పాఠశాలకు ఏ అవసరం వచ్చినా తమకు గుర్తుచేయాలని సూచించారు.