11-08-2024 03:32:44 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 10: అమెరికా షార్ట్సెల్లింగ్ కంపెనీ హిండెన్బర్గ్ రిసెర్చ్ భారత్కు చెందిన అదానీ గ్రూప్ అక్రమాలపై మరో బాంబు పేల్చింది. ఈసారి ఏకంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) డైరెక్టర్పైనే తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ షెల్ కంపెనీల్లో సెబీ చీఫ్ మధబి పురి బుచ్తోపాటు ఆమె భర్తకు కూడా వాటాలున్నాయని ఆరోపించింది. దాదాపు 40 మీడియా సంస్థలు నిర్వహించిన దర్యాప్తుతోపాటు పలువురు విజిల్ బ్లోయర్ల నివేదికల ఆధారంగా ఈ విషయాన్ని ధృవీకరించుకొన్నట్టు శనివారం ఓ నివేదిక విడుదల చేసింది. భారత్లోని లిస్టెడ్ కంపెనీలన్నింటిని అజమాయిషీ చేసే అత్యున్నత పర్యవేక్షణ సంస్థ సెబీ. ఇప్పుడు ఆ సంస్థ అధిపతే అక్రమాలుక తెరలేపారని నివేదిక బయటకు రావటం సంచలనంగా మారింది.
నివేదికలో ఏముంది?
తనకుతానే క్లీన్చిట్?
అదానీ గ్రూప్ షెల్ కంపెనీలను ఉపయోగించ వేలకోట్ల డాలర్ల నకిలీ ఇన్వాయిస్లతో భారీగా వ్యాపారం చేస్తున్నట్టు నమ్మించి షేర్ విలువ కృత్రిమంగా పెంచుకొన్నదని 2023 జనవరిలో హిండెన్బర్గ్ రిసెర్చ్ విడుదల చేసిన నివేదిక భారత్ను ఓ కుదుపు కుదిపింది. గౌతమ్ అదానీ ప్రధాని మోదీకి సన్నిహితుడు కావటంతో ఈ అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఈ నివేదిక దెబ్బకు అదానీ గ్రూప్ విలువ 150 బిలియన్ డాలర్లు కరిగిపోయింది. ఈ అంశంపై దర్యాప్తు చేసిన సెబీ.. అదానీ కంపెనీల్లో ఎలాంటి అవకతవకలు జరుగలేదని క్లీన్చిట్ ఇచ్చింది. పైగా తప్పుడు నివేదిక ఇచ్చి లాభం పొందారంటూ హిండెన్బర్గ్ సంస్థకే షోకాజ్ నోటీసు ఇచ్చింది. తాజాగా హిండెన్బర్గ్ ఏకంగా సెబీ చీఫ్పైనే తీవ్ర ఆరోపణలు చేయటంతో ఇది మరోసారి దేశాన్ని కుదిపేసే సూచనలు కనిపిస్తున్నాయి.