03-06-2025 05:51:41 PM
సంతాపం ప్రకటించిన దివ్యాంగుల సంఘం..
పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా(Suryapet District) పెన్ పహాడ్ మండలం అనాజీపురంకు చెందిన దివ్యాంగుల సంఘం సీనియర్ నాయకులు లక్కపాక రాములు(46) ఇటీవల ఉపాధి పనికి వెళ్ళి తన ట్రై సైకిల్ పై వస్తుండగా బీపీ పెరగడంతో కళ్లుతిరిగి కింద పడిపోయాడు. ఈ నేపథ్యంలో ఆపస్మారక స్థితిలో ఉన్న మృతుడు రాములుని చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్యతో పాటు కొడుకు, కూతురు ఉన్నారు. ఈ మేరకు దివ్యాంగుల సంఘం మండల అధ్యక్షులు పేర్ల సోమయ్య, ఉపాధ్యక్షులు గుండు శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి గార్లపాటి వెంకటరెడ్డి, అలాగే సంఘ నాయకులు దొంతగాని రాంబాబు గౌడ్, శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యడు చిన్నపంగ నర్సయ్య తదితరులు విచ్చేసి మృతుడు రాములు పార్దివ దేహానికి పూలమాలలు వేసి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.