31 May, 2026 | 6:45 PM

Breaking News

రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •   అది రైతు డిస్కం కాదు... రైతుల ప్రాణాలు తీసే 'బలిపీఠం'!   •   వరికొయ్యలు, పంట అవశేషాలను కాల్చొద్దు   •  

ఎస్జీఎఫ్ విజేత మహబూబ్‌నగర్ జట్టు

22-10-2025 01:16 AM

అభినందించినఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, స్పోరట్స్ చైర్మన్ శివసేన రెడ్డి

రాజాపూర్ అక్టోబర్ 21: రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్ 17 వాలీబాల్ క్రీడా పోటీల్లో మహబూబ్ నగర్ బాలికల జట్టు సమిష్టిగా ఆడి కప్పును కైవసం చేసుకున్నారు. మండలంలోని తిరు మలాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో మహబూబ్ నగర్ బాలికలు నిజామాబాద్ జట్టుపై రెండు సెట్లను గెలిచి కప్పును కైవసం చేసుకున్నారు.రెండవ స్థానం లో నిజామాబాద్ జట్టు, మూడవ స్థానం లో ఖమ్మం బాలికల జట్లు నిలిచాయి.

విజేతలు గెలిచినా జట్లకు రాష్ట్ర స్పోరట్స్ చైర్మన్ శివసేనారెడ్డి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కప్పు మెడల్స్ అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువులతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు.క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర పటుత్వాన్ని పెంచుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి దినచర్యలు కొంత సమయం క్రీడలకు కేటాయించాలని తెలిపా రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక క్రీడలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. మూడు రోజులపాటు క్రీడలను దిగ్విజయంగా నిర్వహించిన తిరుమలాపూర్ గ్రామ ప్రజలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ శారదాబాయి, ఎంఈఓ సుధాకర్, బచ్చిరె డ్డి,యాదయ్య,శ్రీనివాస్,సత్యనారాయణ గౌడ్, కృష్ణయ్య, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.