23-10-2025 07:35:16 PM
కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో వానాకాలం వరి ధాన్యం కొనుగోలు గురించి గురువారం జిల్లా సహకార అధికారి కామారెడ్డి ఆదేశాలతో బిక్నూరు క్లస్టర్ పరిధిలో 12 సంఘాల కార్యదర్శులు సెంటర్ ఇన్చార్జిలు, ట్యాబ్ ఆపరేటర్లు అందరితో వరి ధాన్యం కొనుగోలు గురించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని బిక్నూర్ క్లస్టర్ అధికారి శ్రీ రమేష్, మానిటరింగ్ అధికారి సురేష్, మసి ఉద్దీన్ ఆధ్వర్యంలో సమావేశము నిర్వహించారు.