22 August, 2026 | 2:54 PM

Breaking News

ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణంపై అవగాహన కార్యక్రమం   •   ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   జగన్నాథ ఆలయంలో హైకోర్టు జడ్జి ప్రత్యేక పూజలు   •   అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   బెల్లంపల్లిలో జూనియర్ సివిల్ కోర్టును ప్రారంభించిన హైకోర్టు జడ్జి   •   డాక్యతాండలో ఘనంగా సామూహిక కుంకుమార్చనలు   •   ప్రజలను ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం సరికాదు   •   జీవో నెంబర్ 97ను రద్దు చేయాలంటూ నిరసన దీక్ష   •   వెంకటరామిరెడ్డి విగ్రహం నెలకొల్పాలని ఏకగ్రీవ తీర్మానం   •   మైలారం యంగ్ ఇండియా పాఠశాల పనులు వేగవంతం చేయాలి   •  

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో హమాలీల కొరత...

23-04-2025 01:51 PM

సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దం కృష్ణారెడ్డి...

అనంతగిరి: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో హమాలీల కొరత ఏర్పడుతుందని, దీంతో సకాలంలో రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు విక్రయించలేకపోతున్నారని సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దం కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కొనుగోలు కేంద్రాలలో హమాలీలకు కూలి రేట్లు పెంచకపోవడంతో వారు మధ్య దళారుల వద్దకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, మధ్య దళారులు హమాలీలకు ఎక్కువ మొత్తంలో కూలీ చెల్లిస్తున్నారని దీంతో వారు అటువైపు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. దీనివల్ల కొనుగోలు కేంద్రాలు ధాన్యం నిలవ ఉండడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారని అన్నారు. అంతేకాకుండా మిల్లులు వద్ద తరుగు పేరుతో కోత విధిస్తూ రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఇబ్బందికి గురి చేస్తున్న మిల్లర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.